కేటీఆర్‌కి శ్రీదేవి, సమంతతో ఫొటోలు దిగడానికి తీరిక వుందా?

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కి కరెంట్ కోతతో విలవిలలాడుతున్న రైతులను, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదుగానీ, ‘శ్రీదేవి, సమంతలతో ఫోటోలు దిగడానికి తీరిక వుందా అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సుయాత్ర శనివారం వరంగల్ జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖను ఎవ్వరికీ అప్పగించలేదు. కనీసం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి సమీక్ష పెడితే, తెలంగాణతరఫున హాజరయ్యేందుకు ఏ ఒక్క మంత్రికీ అదనపు బాధ్యతలు అప్పగించలేదు. సమంత, శ్రీదేవిలతో క్యాట్‌వాక్ చేయడం మాని, ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ తీసుకురావాలని కేటీఆర్‌ను డిమాండ్ చేస్తున్నా’’ అన్నారు.