విశాఖ దగ్గర తీరాన్ని తాకిన హుదూద్ తుఫాన్

 

హుదూద్ పెను తుఫాను విశాఖ పట్టణం వద్ద తీరాన్ని తాకింది. విశాఖ వైపు దూసుకొచ్చిన తుఫాను ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో విశాఖ తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం వుందని అధికారులు తెలిపారు. దీంతో తీరం వెంబడి గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. హుదూద్ తుఫాన్ ఆదివారం మధ్యాహ్నం తీరాన్ని దాటిన తర్వాత 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం వుందని తెలుస్తోంది.