అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఘర్షణ వాతావరణం

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్-2013 (తెలంగాణా బిల్లు)ను శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టడంతో...అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణా బిల్లును చించివేయగా, వైకాపా ఎమ్మెల్యేలు బిల్లును దహనం చెయండంతో...తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉగిపోయారు. ఈ సంధర్బంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరగడంతో మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘర్షణ జరగకుండా నివారించారు.