టిడిపి వర్సెస్ టీఆర్ఎస్: కిందపడ్డ నన్నపనేని

 

 

 

తెలంగాణా బిల్లును శాసనమండలిలో ప్రవేశ పెట్టిన తరువాత...శాసనమండలి మీడియా పాయింటు వద్ద కూడా తీవ్ర ఉద్రికత్త వాతారవరణం నెలకొంది. టీఆర్ఎస్, టిడిపి ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నన్నపనెని రాజకుమారి కిందపడిపోయారు.


మొదట సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్సీలు సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడేందుకు సిద్ధమవుతూ ప్రతులను చించివేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్వామిగౌడ్ అడ్డుకోబోయారు. వెంటనే పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. అనంతరం ఇరువర్గాల వారు బల్లలేక్కి నినాదాలు చేశారు.