24 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు..

 

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. మూడు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు సైతం కురిసే అవకాశముందని స్పష్టం చేశారు.