తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు..

 

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు రానున్నట్టు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఈ నెల 20న రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్-విజయవాడ మధ్య రెగ్యులర్ సర్వీసులను నడపనున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటకు సికింద్రాబాద్లో బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.