అరుణ్‌ జైట్లీ మృతిపట్ల కేసీఆర్, జగన్‌ సంతాపం

 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అరుణ్ జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జగన్ ట్వీట్‌ చేశారు.

 

 

అరుణ్‌ జైట్లీ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతికి ఆయన చేసిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.