కేసీఆర్ కాదు... వరుణుడే ఆత్మహత్యలకు కారణం

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి... బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన సూసైడ్స్ కు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని పోచారం ప్రకటించారు, రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదన్న ఆయన... వరుణదేవుడిపై నెపం నెట్టేశారు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, రుణభారం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రుణమాఫీ కింద ఇప్పటివరకు 8వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామన్న పోచారం... మొత్తం రుణమాఫీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu