ఏపీకి కళా వెంకట్రావు, తెలంగాణకి మళ్లీ ఎల్.రమణే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల నియామకానికి కసరత్తు పూర్తయింది, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా రేపు కొత్త కమిటీలను ప్రకటించనున్నారు. ఏపీ, తెలంగాణ కమిటీలతోపాటు కేంద్ర కమిటీని కూడా బాబు అనౌన్స్ చేయనున్నారు, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండనుండగా, ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, నామా నాగేశ్వర్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శులుగా బోండా ఉమ, జయనాగేశ్వర్ రెడ్డి, వర్ల రామయ్యలను నియమిస్తారని తెలుస్తోంది, తీవ్ర పోటీ నెలకొనడంతో ఐవీఆర్ఎస్ విధానాన్ని అమలుచేసినా మళ్లీ ఎల్.రమణకే తెలంగాణ పగ్గాలు దక్కనున్నాయి , వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా కేపీ వివేకానంద, సండ్ర వెంకటవీరయ్య, మల్లయ్యయాదవ్,  సీతక్కలను నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధులుగా నన్నూరి నర్సిరెడ్డి, కర్నాటి విద్యాసాగర్, ప్రతాప్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా, ఢిల్లీలో జాతీయ అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీఎం రమేష్ లను నియమిస్తారని తెలుస్తోంది,