టీ20 పాక్-భారత్ మ్యాచ్ జరుగుతుందా..?లేదా..?


టీ20 పాక్-భారత్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడనుందా.. అసలు కోల్కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే శనివారం ఉదయం అక్కడ భారీవర్షం పడింది. ఈ కారణంగా మ్యాచ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయంత్రానికి వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో కూడా మొదలైంది. ఎలాంటి వర్షసూచన లేకపోయినా, ఉదయం మాత్రం కోల్‌కతాలో వర్షం పడటంతో.. ఏం జరుగుతుందోనని అంతా వరుణదేవుడిని ప్రార్థిస్తున్నారు.