ప్రాణాపాయ స్థితిలో మాఫియా డాన్ చోటా రాజన్..

 

మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ్ నికల్జే ఇండోనేసియా పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే తన కిడ్నీలు పాడైపోయినందున చికిత్స నేపథ్యంలోనే చోటా డాన్ పోలీసులకు చిక్కినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం చోటా రాజన్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. డయాబెటీస్ తో పాటు గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న అతడి మూత్రపిండాలు రెండూ చెడిపోయాయని.. తక్షణమే డయాలసిస్ చేస్తే తప్పించి అతడి ప్రాణాలు నిలిచేలా లేవని అధికారులు తెలుపుతున్నారు. అయితే అతనికి జైల్లో చికిత్స అందిస్తున్నా ఎలాంటి ఉపయోగం లేదని.. అతనిని ఢిల్లీలోని ఓ మెరుగైన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామంటూ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 30న విచారణ జరగనుంది.