సుష్మాకు కిడ్నీ ఫెయిల్యూర్..ఆస్పత్రిలో చేరిక

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె కిడ్నీ ఫెయిల్ కావడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరారు. ఈ వివరాలను స్వయంగా సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం తాను ఏయిమ్స్‌లో చేరానని..డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిమిత్తం తనకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నట్లు ట్వీట్‌ చేశారు. కృష్ణ భగవానుడి ఆశీస్సులతో తాను తిరిగి కోలుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.