మేం చర్చకు సిద్ధం: మోడీ

పార్లమెంట్‌లో తాము ఏ అంశంపైనైనా..ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు ప్రధాని నరేంద్రమోడీ..పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు ప్రధాని సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..గత సమావేశాల్లో జీఎస్‌టీ లాంటి ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందిందని..అందుకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లోనూ అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెద్ద నోట్లపై పార్లమెంట్‌లో దుమారం రేపేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న వేళ ప్రధాని ప్రకటన ఆసక్తిని రేకిత్తిస్తోంది.