దీపక్‌మిశ్రాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం

 

ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమెన్ ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు యాకుబ్ మెమెన్ కు శిక్ష వేసిన జడ్డి సుప్రీంకోర్టు జడ్జి దీపక్‌మిశ్రాకు అసలు చిక్కు వచ్చిపడింది. యాకుబ్ మెమెన్ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో అతని పిటిషన్ ను న్యాయమూర్తులు కొట్టిపారేశారు. దీంతో యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష వేశారు. అయితే యాకుబ్ మెమెన్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తుల్లో దీపక్‌ మిశ్రా ఒకరు.దాంతో ఇప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇంటికి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత భద్రత ఏర్పాట్లు ఉన్నా వదిలిపెట్టబోమని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు యాకుబ్ మెమెన్ సోదరుడు టైగర్ మెమెన్ కూడా తన సోదరుడి ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు.దీంతో దీపక్‌మిశ్రా ఇంటి దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu