2011 గ్రూప్-1 మళ్ళీ నిర్వహించండి: సుప్రీంకోర్టు

 

 Supreme Court Cancels APPSC Group 1 Mains, Supreme Court, APPSC,  Group 1, Andhra Pradesh

 

 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 2011లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోసారి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూలు జరపాలని కమిషన్ ను న్యాయస్థానం ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం ఏపీపీఎస్సీ ప్రకటించిన కీలో ఆరు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు పరీక్షకు హాజరైన అభ్యర్థులు గుర్తించారు. వాటిని తొలగించి ఉత్తీర్ణతను నిర్ధారించాలని, ఆ మేరకు మెరిట్ లిస్ట్‌ను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

 

 

 

ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీని నియమించాలని ఈ ఏడాది జనవరి 4న ఏపీపీఎస్సీని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఏపీపీఎస్సీనే తప్పు చేసిందని, మళ్లీ వారిచేతే నిపుణుల కమిటీ వేయించడం సరికాదంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశాన్ని యూపీపీఎస్సీకి సిఫార్సు చేస్తూ జూలైలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.