జగన్ పై నా తమ్ముడితో కావాలనే దాడి చేయించారు

 

వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ సోదరి రత్నకుమారి.. తన తమ్ముడిని చంపేస్తారేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై జరిగిన దాడి గురించి ఆమె మాట్లాడుతూ...‘జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు. ఎవరు చేయించారో చెబితే.. వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పడం లేదేమో. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు. ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు. అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’ అని తెలిపారు. ‘నా తమ్ముడి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్‌ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్‌లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే.. టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది' ఆవేదన వ్యక్తం చేశారు.