భారత్ విజయ లక్ష్యం 287 పరుగులు

కొలంబో: టీమిండియా ముందు 287 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 286 పరుగులు చేసింది.  20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంకను సంగక్కర(73), జయవర్థనే (65) అర్థ సెంచరీలతో ఆదుకున్నారు. మ్యాథ్యూస్(71), మెండిస్ (45) అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించారు. తరంగ(8), దిల్షాన్(4), చాందిమాల్(0) నిరాశపరిచారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్ పఠాన్, దిండా, రాహుల్ శర్మ తలో వికెట్ తీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu