కాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం..

విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల నుండి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణ నుండి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ హాజరయ్యారు. కాగా పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, కొత్తపన్నుల విధానం, పర్యాటకం, నక్సలిజం వంటి వాటిపై ప్రధాన చర్చ జరగనుంది. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ మొదటి సారి అమరావతికి రావడం చాలా సంతోషంగా ఉందని..రాష్ట్రాలు విడిపోయినా ప్రజలంతా కలిసి ఉండాలని అన్నారు. అంతేకాదు సమావేశంలో రాష్ట్రాల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. మా రాష్ట్రాల సమస్యలు గురించి లేవనెత్తుతాం.. అన్ని రాష్ట్రాలను కలుపుకొని సమస్యల పరిష్కారానికి కృషిం చేస్తామని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu