రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... దయచేసి వినండి...కాదు, చదవండి..!

కృపయా ధ్యాన్ దే... దయచేసి వినండి... ప్రయాణికులకు ముఖ్య గమనిక... ఇలాంటి అనౌన్స్ మెంట్స్ ఎక్కువగా రైల్వే స్టేషన్లలో మాత్రమే వినబడుతుంటాయి. ఇఫ్పుడు మీరు చదవబోయే వార్త కూడా రైల్వే ప్రయాణికులకు సంబంధించినదే. అంతేకాదు, కచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్తే. ఎందుకంటే, దక్షిణమధ్యరైల్వే పెద్దఎత్తున రైళ్లను రద్దు చేసింది. ఏడు రోజులపాటు పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ముద్కేడ్-పర్బని మధ్య డబ్లింగ్ పనులు... అలాగే, నాన్ ఇంటర్ లాకింగ్ కారణంగా దక్షిణమధ్యరైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి పది నుంచి పదిహేను వరకు 37 రైళ్లను పూర్తిగా.... 33 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.

రద్దయిన రైళ్లలో హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, మేడ్చల్‌-హెచ్‌ఎస్‌, నాందేడ్‌-మేడ్చల్‌, ఆదిలాబాద్‌-పూర్ణ-ఆదిలాబాద్‌, నిజామాబాద్‌-పంధర్‌పూర్‌-నిజామాబాద్‌, తిరుపతి-అమరావతి-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి-ఆదిలాబాద్‌ తదితర రైళ్లు ఉన్నాయి. అయితే, రైళ్ల ప్రయాణికులు  రద్దయిన రైళ్ల వివరాలు తెలుసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణమధ్యరైల్వే సూచించింది.