కారు ప్రమాదంలో శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు

 

వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి నిన్న రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆళ్లగడ్డలో ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తుండగా రాత్రి 11గంటల సమయంలో దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నపటికీ, ఆమె శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నందున, ఐ.సీ.యూ.లో ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu