నడిసంద్రంలో చమురు నౌక బోల్తా.. 13 మంది ఇండియన్స్ సహా 19 మంది గల్లంతు

నడి సముద్రంలో చమురు నౌక బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది భారతీయులు సహా తొమ్మండుగురిని సహాయ బృందాలు రక్షించాయి. 16 మంది గల్లంతయ్యారు. ఒకరు మరణించారు.

 గల్లంతైన వారిలో శ్రీలంకకు చెందిన ముగ్గురు, ఇండియాకు చెందిన 13 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఒమన్ సమీపంలో సముద్రంలో కామొరస్ కు చెందిన ఆయల్ ట్యాంకర్ బోల్తాపడింది.

ప్రిస్టీజ్ ఫాల్కాన్ అనే ఈ నౌక ఒమన్ ఇండస్ట్రియల్ పోర్ట్ సమీపంలో సముద్రంలో మునిగి బోల్తాపడిందని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu