బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి శంకర్రావు

 

 

 

కోడలి వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి శంకర్రావును సీసీఎస్ పోలీసులు ఈ ఉదయం ఉస్మానియా ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న అరెస్టయిన ఆయన స్పృహతప్పి పడిపోవడంతో ఆయనను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం మరింత మెరుగయిన చికిత్స కోస్ కేర్ ఆసుపత్రికి తరలించారు.


వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు శంకర్రావును మారేడుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. శంకర్‌రావు కుమారుడు శశాంక్‌కు, వంశీప్రియకు 2005లో పెళ్లి జరిగింది. ఆ తరువాత శంకర్రావు కూతురు భర్తతో విడిపోయి ఇంట్లోనే ఉంటోంది. అప్పటి నుండి  ఆమె వంశీప్రియను వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఆమె భర్త నుండి విడిపోయింది. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో శంకర్రావు సాక్షులను బెదిరించారని ఆరోపణలున్నాయి. ఇదే కేసులో శంకర్రావు కూతురు సుస్మితను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.