కుప్పకూలిన ఎక్సైజ్ కార్యాలయం పైకప్పు

రంగారెడ్డి జిల్లా  షాద్ నగర్ లోని ఎక్సైజ్ కార్యాలయం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎక్సైజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ ను సహచర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  
ఎక్సైజ్ కార్యాలయం పురాతన భవనంలో కొనసాగుతున్నదనీ, ఆ కారణంగానే పైకప్పు కూలిపోయిందని అంటున్నారు.