మెదక్ దుర్ఘటన.. మోడీ దిగ్భ్రాంతి.. త్వరలో రైల్వే మంత్రి ప్రకటన!

 

మెదక్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాక్షించారు. కాగా ఈ ప్రమాదం మీద కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ గురువారం సాయంత్రం మూడు గంటలకు ఒక ప్రకటన చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అంశం కూడా ఈ ప్రకటనలో వుండే అవకాశం వుందని తెలుస్తోంది.