కృష్ణాజిల్లాలో స్కూలు బస్సుకు ప్రమాదం!!

 

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది పిల్లలు, డ్రైవరు, క్లీనర్ మరణించిన సంఘటన ఇంకా తెలుగువారి గుండెలను పిండేస్తున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో మరో స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. కృష్ణాజిల్లా జగయ్యపేట మండలం రామచంద్రునిపేటలో ఓ స్కూలు బస్సు ప్రయాణిస్తుండగా బస్సు రెండు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ బస్సును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు తక్కువ వేగంతో వెళ్ళడం వల్ల కూడా పెద్ద ప్రమాదం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu