ఎస్‌బీఐ బంపరాఫర్.. డిఫాల్ట‌ర్ల రుణాల రద్దు..

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యాపార వేత్తలకు ఓ బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే తమ వద్ద రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపార వేత్తలకు ఊర‌ట క‌లిగించే ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం 63 మంది డిఫాల్ట‌ర్లకు చెందిన రూ.7 వేల కోట్ల మొండి బ‌కాయిల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇందులో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఒగనామం వేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా పేరు కూడా ఉంది. విజ‌య్ మాల్యాకు చెందిన బ‌కాయిల‌ను కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ బ్యాంకులో  లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన రూ.1,201 కోట్లు ఉండగా..విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్‌గేర్స్ రూ.65 కోట్లు, ఘన్‌శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జెవెల్స్ రూ.61 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.51 కోట్లు, టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.93.68 కోట్లు, తదితర కంపెనీల బకాయిల మాఫీ జరిగింది.