సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై తుది తీర్పు నేడే

 

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసును విచారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానం నేడు దోషులుగా నిరూపించబడిన ఆ సంస్థ మాజీ చైర్మన్ రామలింగ రాజు, ఆయన ఇద్దరు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు, ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆ సంస్థ ఆడిటర్స్ యస్. గోపాల కృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్ తదితరులకు ఈ రోజు శిక్షలు ఖరారు చేయనున్నారు. క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే తుది తీర్పు ప్రకటించవలసి ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన తీర్పు మూడుసార్లు వాయిదా వేయబడింది. చివరికి ఈరోజు తుది తీర్పు వెలువడనుంది. కనుక ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడిన వారంరూ ఈరోజు కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఒకవేళ కోర్టు వారందరికీ జైలు శిక్షలు విధించినట్లయితే, వారందరినీ జైలుకి తరలించవచ్చును అలాగే వారు మళ్ళీ బెయిలు తీసుకొని బయటకు రావచ్చును. కోర్టు శిక్షలు ఖరారు చేసినప్పటికీ వారందరూ మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది కనుక ఎవరికీ అంత త్వరగా శిక్షలు అమలుచేసే అవకాశం ఉండకపోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu