సానియాకి కేసీఆర్ మరో కోటి గిఫ్ట్

 

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సానియాకి మరో కోటి రూపాయలు నజరానా ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్డ్ టైటిల్ గెలుచుకున్నందుకు గానూ ప్రభుత్వం గురువారం సానియాకు ఈ పారితోషికం ప్రకటించింది. మరోవైపు సానియాకు గతంలోనే కోటి నజరానాపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. టోర్నీ ముగించుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న సానియా... ‘‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే నేను టైటిల్ సాధించగలిగాను. ముఖ్యమంత్రి నన్ను ఎంతో ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం నాకు యూఎస్ ఓపెన్‌కు ముందు శిక్షణ పొందేందుకు ఉపయోగపడింది. వివాదాల సమయంలో ప్రభుత్వం నాకు ఎంతో అండగా నిలిచింది. ఆ కృతజ్ఙతతోనే... గెలిచాక నా మనసులో మాటను బయట పెడుతూ ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చా’’ అని చెప్పారు. బాగుంది.