నా ప్రశ్నలకు ఏసీబీ సమాధానం చెప్పలేదు.. సండ్ర
posted on Jul 10, 2015 6:39PM

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్రను ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని సండ్రను ప్రశ్నించగా... దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని సండ్ర చెప్పారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఏసీబీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని..తన పైన ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదని చెప్పారు. కాని తాను కొన్ని ప్రశ్నలు ఏసీబీని అడిగానని.. తాను అడిగిన ప్రశ్నలకు ఏసీబీ సమాధానం చెప్పలేదని సండ్ర కోర్టుకు తెలిపారు. టీఆర్ఎస్ లో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అన్ని సీట్లు ఎలా గెలుచుకుందని.. గెలుచుకోవడానికి కారణం ఏంటని అడిగానని దానికి వారు సమాధానం చెప్పలేదని చెప్పారు.