క్రికెట్ దేవుడు సచిన్ కు 'భారతరత్న'

 

 

 

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు భారత అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 'భారత రత్న' కు ఎంపికైన తొలి క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఇరవై నాలుగు ఏళ్ళుగా భారత క్రికెట్ సచిన్ అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.

 

భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ను ప్రకటించడం పట్ల సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తన తల్లికి అంకితం ఇస్తున్నానని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu