ఆర్టీసీ డ్రైవర్ గంగాధర్‌కి నివాళి...

 

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు దగ్ధం కావడం, ఆ బస్సు డ్రైవర్ గంగాధర్ ఈ ప్రమాదంలో సజీవ దహనం కావడం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించింది. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి ఆరు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.