గుంటూరులో టీవీ కెమెరా మెన్ పై రౌడీ షీటర్ దాడి

పేదలకు ఇచ్చే 1,000 రూపాయల నగదు సాయం విషయంలో వివాదం తలెత్తడంతో , ఒక టీ వీ ఛానల్ కెమెరా మెన్ పై ఒక రౌడీ షీటర్ దాడి చేసిన సంఘటన వెలుగు చూసింది. సక్రమంగా పంపకాలు జరగడం లేదని సమాచారం అందుకున్న కెమెరా మ్యాన్,  ఘటన స్థలానికి చేరుకుని ప్రశ్నించగా సదరు రౌడీ షీటర్ కొందరు వ్యక్తులతో కలసి దాడికి పాల్పడ్డాడు. సదరు రౌడీ షీటర్ స్థానిక వాలంటీర్ అని తేలింది.రంగంలోకి దిగిన ఆ పార్టీ నేతలు, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు తెరచాటున ప్రయత్నాలు మొదలెట్టారు.