కాశ్మీరీ పండిట్లకు మోడీ అండ

 

Return of Pandits to Kashmir, Modi Kashmir Pandits, narendramodi

 

 

కాశ్మీరీ పండిట్లకు అండగా నిలవటానికి మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కాశ్మీర్‌లో చాలామంది కాశ్మీరీ పండిట్లు తీవ్రవాదులకు భయపడి కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. వారికి భరోసా ఇచ్చి, వారిని మళ్ళీ కాశ్మీర్‌కి తీసుకువచ్చేలా ప్రయత్నించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు జమ్ము, లఢక్ ప్రాంతాల అభివృద్ధికి క‌ృషి చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1990లో తీవ్రవాదుల భయంతో రాష్ట్రం విడిచి వెళ్లిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాలంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే ఇప్పటి వరకూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా వ్యవహరిస్తున్న ప్రాంతాన్ని ఇక నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాశ్మీర్ సమస్యను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మోడీ ప్రభుత్వం గుర్తించినట్లయింది. ఒక ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని మాత్రమే పిలవడం వల్ల ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని ఎన్డీయే ప్రభుత్వంఅభిప్రాయపడుతోంది.