రాజస్థాన్ సీఎం రాజేకి పదవీ గండం
posted on Sep 19, 2015 6:20PM

లలిత్ మోడీ వివాదంలో ఇరుక్కుని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుని మోడీ అండతో గట్టెక్కిన రాజస్థాన్ సీఎం వసుంధరరాజే మళ్లీ చిక్కుల్లో పడింది. మొన్న లలిత్ గేట్ బయటపడితే, ఇప్పుడు తాజాగా గనుల కుంభకోణం వెలుగుచూసింది, ప్రధాని కార్యాలయమే స్వయంగా కోవర్టు ఆపరేషన్ చేసి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాజస్థాన్ సీఎం వసుంధరకు కూడా మోడీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘ్వీని పీఎంవో ఆదేశాల మేరకే అరెస్ట్ చేశారట. అంతేకాదు అరెస్ట్ కు సంబంధించి ముఖ్యమంత్రికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, పైగా ఈ స్కాంలో వసుంధరరాజేతోపాటు ఆ రాష్ట్ర హోంమంత్రి కటారియా పాత్ర కూడా ఉందని పీఎంవో గుర్తించిందట . మరుగున పడిపోవాల్సిన ఈ కేసును ప్రధాని చొరవతోనే బయటికి వచ్చిందని, వసుంధరరాజేని ఎలాగైనా తప్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారని ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ఇచ్చింది. అందుకే అరెస్ట్ చేసేవరకూ ఏం జరుగుతుందో కూడా సీఎం రాజేకి తెలియలేదని, చివరికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కి కూడా సమాచారం లేదని రాసుకొచ్చింది. ఒకవేళ ఆ పత్రిక కథనమే నిజమైతే, వసుంధరరాజే ప్లేస్ లో మరొకరు రావడం ఖాయం