పార్టీ నుండి రాజయ్య సస్పెండ్..?


కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవులు అతి దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు రాజయ్య ఎపిసోడ్ నుండి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే రాజయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మెజార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సాయంత్రంలోపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu