రాహుల్ వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీల .. ఆగ్రహం !
posted on Jul 21, 2025 7:27PM
.webp)
కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్), భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్సిష్స్ట్ ) లను ఒకే గాటన కట్టేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టాయి. నిజానికి, రాహుల్ గాంధీ ఒక్క ఆర్ఎస్ఎస్, సీపిఐ(ఎం)లను మాత్రమే కాదు, మొత్తంగా రాజకీయ వ్యవస్థనే, టార్గెట్ చేస్తూ, రాజకీయ నాయకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదనే అర్థం వచ్చేలా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల కూటమి భాగస్వామయ పార్టీలు, ముఖ్యంగా, వామపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి.
కొట్టాయం (కేరళ)లో జరిగిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ ద్వితీయ వర్ధంతి సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్,సిపిఐ( ఎం)లనిఉ ఒకే గాటన కట్టి విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్’ తోపాటుగా, సిపిఎం(ఎం)ను తమ సైద్ధాంతిక శత్రువుగా పెర్కొన్నారు. అటు ఆర్ఎస్ఎస్ ఇటు సిపిఐ (ఎం)తో తాను సైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని, చెప్పుకొచ్చారు. ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం) లకు మానవీయ విలువలు తెలియవని, ప్రజాసమస్యలు పట్టవని,విమర్శించారు.
నిజానికి, ఆర్ఎస్ఎస్, సిపిఐ(ఎం)లను మాత్రమే కాదు, రాహుల్ గాంధీ, ఇడియా కూటమి భాగస్వామ్య పార్టీలు సహా మొత్తం రాజకీయ వ్యవస్థనే టార్గెట్ చేస్తూ, ‘సమకాలీన రాజకీయ నాయకులలో కొద్ది మంది మాత్రమే ఇతరుల మనోభావాలను పంచుకుంటున్నారు” అంటూ, రాజకీయాలలో ఉండాలంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని,పార్టీ నాయకులకు హితబోధ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను, ఇండియా కూటమి నాయకులు తప్పు పట్టారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సిపిఐ జాతీయ నాయకుడు,డి. రాజా, ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు మంచిది కాదని హితవు పలికారు.
కూటమిని బలహీన పరుస్తాయని హెచ్చరించారు. మరోవంక సిపిఐ(ఎం) పొలిట్’ బ్యూరో సభ్యుడు, ఎంఎస్ బేబీ, ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం అంటూ, రాహుల్ గాంధీకి కేరళ రాజకీయాలు అర్థం కాలేదని చురక అంటించారు. అలాగే, 2004లో వామపక్షాల మద్దతుతోనే కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసియన్ విషయాన్ని గుర్తు చేశారు. అయితే, “ బీజీఎపీ హటావో .. దేశ్ కో బచావో’ నినాదంతో ఏర్పడిన కూటమి లక్షయం నేరవేరే వరకు, ఇండియా కూటమిలో కొనసాగుతామని లెఫ్ట్ నేతలు. చెప్పడం కొసమెరుపు.