ఢిల్లీకి తిరిగొచ్చిన ప్రధాని మోడీ

 

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వాషింగ్టన్ నుంచి మంగళవారం రాత్రి బయల్దేరిన ప్రధాని ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో దిగిన మోడీకి పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.