స్వచ్ఛ భారత్: రోడ్డు ఊడ్చిన మోడీ

 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ స్వయంగా చీపురు పట్టారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తారు. మోడీతో పాటు పలువురు మంత్రులు, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు అయిదు వేలమంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు మోడీ వాల్మీకి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.