తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి

 

తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకుడు, న్యాయ కోవిదుడు సుబ్రహ్మణ్యం స్వామి అభిప్రాయపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు, ఆమె సహచరులు నలుగురితో కలిపి వంద కోట్ల జరిమానా బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తమిళనాడులో కనీసం నాలుగు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించడమే న్యాయమని, లేకపోతే అరాచకశక్తులు తమిళనాడులో అల్లర్లు సృష్టించే ప్రమాదం వుందని ఆయన అన్నారు. జయలలిత మీద సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసు ఫలితంగానే ఆమెకు జైలు ప్రాప్తించింది. కాగా, జయలలితకు కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించినందుకు నిరసనగా పలువురు అన్నా డీఎంకే పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి మీద రాళ్ళు విసిరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu