ప్రణబ్ దాదాకి గ్రాండ్ ఫెర్‌వేల్

రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనుండటంతో ప్రభుత్వం ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రణబ్‌ను ఘనంగా సత్కరించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీల సంతకాలతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్‌కు సుమిత్రా మహాజన్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..1969లో ఎంపీగా పార్లమెంటుకు వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని..రాజకీయ నాయకుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ప్రశంసించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu