శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు పవన్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్‌ను దర్శించుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. రెండ్రోజుల క్రితం హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వచ్చిన పవన్ అక్కడే బస చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.