షీనా కేసు:రాహుల్ తో పీటర్ ఫోన్ సంభాషణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. షీనా కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. షీనా హత్య గురించి ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసనని, షీనాను ప్రేమించిన పీటర్ కుమారుడు రాహుల్‌తో పీటర్ జరిపిన 20 ఫోన్ సంభాషణలను సీబీఐ సంపాదించింది. వీటిలో ఏడింటిని సీబీఐ మీడియాకు వివరించింది. షీనా హత్యకు గురైన తర్వాత, తనను వదిలి వెళ్లిందని రాహుల్ భావించాడు, పీటర్ అతను ఎలా సముదాయించాలని ప్రయత్నించాడో ఈ సంభాషణల్లో తేట తెల్లమైంది. అందులో ఒక కాల్‌లో ఆమె కనిపించకపోతే ఏమవుతుంది..? ఎందుకీ సోది అని పీటర్ అన్నట్లుగా ఉంది. మరో కాల్‌లో ఇక ఆమె గురించి పూర్తిగా వదిలెయ్ అని పీటర్ అన్నట్టు తెలుస్తోంది. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెను సంచలనం కలిగిస్తున్నాయి.