ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి వుంది

 

పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు నగరాలపై ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఎన్ఎస్జీ చీఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని నిర్ధారించి హెచ్చరించడంతో నిఘావర్గాలతోపాటు  రాష్ట్రాల పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu