మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారు సీజ్

లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయున కారును సీజ్ చేశారు. దీంతో పోలీసులకు, కొల్లు రవీంద్రకు చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఐపీసీ సెక్షన్ 188,  ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.