తన భార్య దగ్గర దొరికిన డబ్బులకు లెక్కలున్నాయట

 

 

 

వైకాపా మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్ది మాజీ మంత్రి పార్థసారథి భార్య కమల నుంచి హైదరాబాద్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 లక్షలకు స౦బంధించి తన వద్ద లెక్కలు వున్నాయని పార్థసారథి చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసమే తన భార్య హైదరాబాద్ లోని కార్పోరేట్ బ్యాంకు నుంచి ఆ నగదును డ్రా చేసుకొని వస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ అభ్యర్థి రూ. 70 లక్షల వరకూ ఖర్చు పెట్టవచ్చని గుర్తు చేశారు. మరోవైపు మచిలీపట్నం లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ తన పార్టీ వాటాగా పలు విడతలుగా డబ్బును అందజేస్తున్నారని, గురువారం దొరికిన డబ్బు కూడా ఈ వాయిదాల్లో భాగంగా ఇచ్చినదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.