పోలీసు సంక్షేమ సంఘం సూటి ప్రశ్నలు

 

తిరుపతి సమీపంలో ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌ మీద రాజకీయ పార్టీలు రకరకాల కామెంట్లు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పార్టీల రాద్ధాంతాన్ని పోలీసు సంక్షేమ సంఘం ఖండించింది. ఎన్‌కౌంటర్ ఘటన జరిగీ జరగకముందే రాజకీయం చేయడం దారుణమని పేర్కొంది. కాల్పులు జరిగినప్పుడు మృతుల కులం, ప్రాంతం తాము చూడలేదని తెలిపింది. ఎర్రచందనం దొంగల కుల, మతాలు, ప్రాంతం పార్టీలకు ఎలా తెలుసని పోలీసు సంక్షేమ సంఘం ప్రశ్నించింది. దొంగలకు మద్దతు ఇస్తున్నవారే వారిని అడవులకు పంపారా అని ప్రశ్నించింది. అధికారులను స్మగ్లర్లు చంపినప్పుడు పార్టీలు ఎందుకు మాట్లాడలేదని పోలీసులు సంక్షేమ సంఘం ప్రశ్నించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu