జమ్ము కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

 

జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 160 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఆదివారం మాట్లాడుతూ కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా తక్షణం గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వరద బీభత్సానికి 2500 గ్రామాలు నీటి ముంపునకు గురికాగా, వరద బాధిత ప్రాంతాల్లో వేలమందిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు, భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహ తీవ్రత పెరిగి, పరిస్థితి వరదలకు దారి తీసింది. శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకుని వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో చర్చించారు.