కుప్పకూలిన విమానం.. బ్రెజిల్ లో 62 మంది దుర్మరణం

బ్రెజిల్‌లో శుక్రవారం (ఆగస్టు 9) జరిగిన విమాన ప్రమాదంలో   62 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో  కుప్ప కూలి పోయింది.  కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులెవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారం భించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News