ప్రకటనల్లో వాళ్లు ముగ్గురే ఉండాలి... సుప్రీంకోర్టు

 

ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లో అధిక సంఖ్యలో ఆయా శాఖ మంత్రుల, సహాయ మంత్రుల ఫోటోలు ఉంటున్నాయన్న విషయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రకటనల్లో ఏ ఒక్క రాజకీయ నేత ఫోటో ఉండటానికి వీలు లేదని, కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ పత్రికా ప్రకటనలను సమీక్ష చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.