పెట్రోల్ ధర సెంచరీ కొడుతుందా?

 

పెట్రోల్ ధర ఎన్నడూ లేని విధంగా పెరగటంతో ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని దుమ్మెత్తి పోశాయి.సర్వత్రా నిరసన గళం వినిపించటంతో దిగివచ్చిన కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ. 2-50 సుంకాన్ని తగ్గించింది. మరో రూ. 2-50 భరించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది.భాజపా పాలిత రాష్ట్రాలు కేంద్రం సూచన మేరకు సుంకం తగ్గించాయి.కానీ గత నాలుగు రోజులుగా పెట్రోల్ ధర పెరుగుతూ వస్తుంది.పెరుగుతుంది స్వల్పమే అనుకుంటే పొరపాటే .. నాలుగు రోజులుగా పైసల్లో పెరిగిన పెట్రోల్ ధర లీటర్ పై దాదాపు రూపాయి పెరగటానికి కారణయింది.శనివారం లీటరు పెట్రోల్‌పై 18 పైసలు, ఆదివారం 14 పైసలు, సోమవారం 21 పైసలు, మంగళవారం 23 పైసలు చొప్పన నాలుగు రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై దాదాపు రూపాయి పెరిగింది.హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 25 పైసలు పెరిగి రూ. 87-21. డీజిల్ 21 పైసలు పెరిగి రూ. 80-61కి చేరింది.కాస్త ఊరట లభించింది అని తేరుకునేలోపే పెట్రోల్ ధర పెరుగుతుండటంతో లీటర్ పెట్రోల్ రూ. 100 చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.